తల్లిదండ్రులు చనిపోవడంతో ఆర్ధిక సమస్యలు
తల్లిదండ్రులు చనిపోవడంతో ఒక్కసారిగా ఆమె ఆర్ధిక సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చింది. అదే సమయంలో పలువురు స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సమయంలో పుట్బాల్ మ్యాచ్లు ఆడటంతో పాటు మ్యాచ్ రిఫరీవైపు కూడా దృష్టిసారించింది. 2010 తర్వాత రెండు సంవత్సరాల పాటు జాతీయ స్ధాయిలో పుట్ బాల్ టోర్నీలేమీ లేకపోవడంతో సీనియర్ రిఫరీలు ఆమెను రిఫరీ వైపు ఎందుకు ప్రయత్నించకూడదని సూచించారు.
జీవితాన్ని మార్చిన 2012
ఒక్కసారి గాయాలు పాలైతే మళ్లీ తిరిగి జీవితంలో మ్యాచ్ రిఫరీ కాలేవని కూడా రూపాకు సూచించారు. తన సీనియర్లు సూచించిన మేరకు 2012లో రూపా దేవి రిఫరీ డెవల్మెంట్ స్కూల్లో చేరింది. ఆ తర్వాత జాతీయ స్ధాయి సబ్ జూనియర్, జూనియర్ స్థాయి మ్యాచ్లకు రిఫరీగా వ్యవహారించింది. ఆల్ ఇండియా పుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన పరీక్షల్లో కూడా పాస్ అయింది. ఆ తర్వాత రూపా దేవి తన జీవితంలో తిరిగి వెనక్కి చూసుకోలేదు. భారత్లో జరిగిన పలు అంతర్జాతీయ మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించింది.
సీనియర్ ఉమెన్ మ్యాచ్లకు రిఫరీగా
శ్రీలంకలో జరిగిన వెస్ట్ ఆసియా టోర్నీలో కూడా రిఫరీగా వ్యవహరించింది. మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో జరిగిన సీనియర్ ఉమెన్ మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించింది. ఇలా మూడు సంవత్సరాలు భారత్లోని వివిధ మ్యాచ్లకు రిఫరీ వ్యవహరించిన రూపా ఆ తర్వాత ఫిఫా నిర్వహించిన రిఫరీ పరీక్షలో పాస్ అయింది. మొదటి నుంచి రూపా వెన్నంటే ఉండి ఆమెకు మద్దతుగా నిలిచిన డుండిగుల్ పుట్బాల్ ఫెడరేషన్ సెక్రటరీ ఎస్.షణ్ముగన్ ఎంతగానో సంతోషించారు.
ఎంతగానో సంతోషించిన డుండిగుల్ పుట్బాల్ ఫెడరేషన్
"రూపాను ఈ స్ధాయికి తీసుకొచ్చేందుకు ఎంతో మంది ప్రొపెషనల్స్ను ఇక్కడికి తీసుకొచ్చాం. మ్యాచ్ రిఫరీగా ఆమెన ఎంతో ప్రోత్సహించాం. తమిళనాడు నుంచి తొలి మ్యాచ్ రిఫరీగా ఫిఫా ఎంపిక చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు. పుట్బాల్ అంటే తనకు ప్రేమ కాబట్టి ఆ క్రీడపై ఎంతో మక్కువ పెంచుకుని తాను ఈ స్ధాయికి చేరానని రూపా ఎప్పుడూ చెబుతుంటూ ఉంటుంది.
భారత్ నుంచి కేవలం ఐదుగురు మహిళాలు మాత్రమే
'నాకు పుట్బాల్ అంటే ఇష్టం. అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. జూనియర్ మ్యాచ్లతో పాటు పురుషుల సీనియర్ మ్యాచ్లకు రిఫరీగా ఉన్నా' అని రూపా దేవి వెల్లడించింది. 2014లో రూపా దేవికి శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం కూడా వచ్చింది. అందరి మహిళా క్రీడాకారిణిలు లాగే రూపా కూడా క్రీడల్లో మహిళలు కూడా రాణించాలని బలంగా కోరుకుంటుంది. భారత్ నుంచి కేవలం ఐదుగురు మహిళా పుట్బాల్ రిఫరీలు మాత్రమే ఉండటం విశేషం. అందులో రూపా దేవి ఒకరు.