హైదరాబాద్: 2022లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో ఖతర్ పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే దీనికంటే ముందు జరగనున్న 2019కోపా అమెరికా ఈవెంట్లో పాల్గొంటామని ఈ మధ్యనే స్వీకరించిన ఆహ్వానానికి బదులు పంపింది. 2022లో ఫిఫా ప్రపంచ కప్లో ఆడనున్న దక్షిణ అమెరికాకు చెందని ఆరు జట్లలో ఒకటిగా ఉండేందుకు సమ్మతం తెలిపింది.
జపాన్ తర్వాత సమ్మతం తెలిపిన ఆసియన్ దేశాల్లో ఖతర్ ముందుగా నిలిచింది. తొలిగా ఈ కోపా అమెరికా లీగ్ను 1999వ సంవత్సరంలో సమురాయ్ బ్లూస్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ విషయాన్ని ఖతర్ ఫుట్బాల్ అసోసియేషన్ ధ్రువీకరించింది. '2019 కోపా అమెరికా లీగ్లో ఖతర్ ఆడనుంది. ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనడం ఓ గొప్ప అవకాశం.' అని ఖతర్ ఫుట్బాల్ ప్రతినిధి ఒకరు మీడియాతో వెల్లడించారు.
కోపా అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానాన్ని పుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెండ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ అంగీకారం తెలిపారు. హమద్ దక్షిణ అమెరికా గవర్నింగ్ సభ్యుల్లో ఒకరు. ప్రస్తుతం ఖతర్ ఫుట్బాల్ జాతీయ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తోన్న స్పానియార్డ్ ఫెలిక్స్ శాంచెజ్ 'ఇలాంటి టోర్నీల్లో ఆడితే మా ఆటగాళ్లకు గొప్ప అనుభవం వస్తుంది' అని తెలిపారు.
జపాన్, చైనా మెక్సికోలతో పాటు ఖతర్ కూడా చేరింది. అమెరికా తరపున ఆడేందుకు బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగయ్ సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 6 అమెరికేతర దేశాలు పాల్గొంటున్న ఈ కోపా అమెరికా లీగ్కు 2011లో ఆహ్వానించినప్పుడు ఖతర్ తిరస్కరించింది. 20202లో కాన్మెబాల్, కాన్కాఫ్ కలిసి టోర్నమెంట్లు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎడిషన్ను యూఎస్ఏతో పాటు 20దేశాలు కలిసి నేతృత్వం వహిస్తున్నాయి. వీటిలో 10 కాన్మెబాల్, 10 కాన్కాఫ్ తరపున బాధ్యత వహిస్తున్నాయి.