'గెలుస్తామని చెప్పలేను.. కానీ పోరాడేందుకు మేం సిద్ధం'

హైదరాబాద్: ఎనిమిది సంవత్సరాలుగా భారత్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న సునల్ చెత్రి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసియన్ పుట్బాల్ కాన్ఫిడరేషన్(ఏఎఫ్సీ) ఆసియా కప్-2011లో దోహా వేదికగా ఆడి పరాజయాన్ని నమోదు చేసుకుంది. ఆ టోర్నీలో భారత్.. రన్నరప్ ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ పవర్ హౌజ్ బహ్రెయిన్, ఆసియా జయింట్స్ దక్షిణ కొరియాలతో గ్రూపు దశలో పోరాడింది.

భారత్కు నిరాశ తప్పలేదు.
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చి టోర్నీని గెలిచి చూపించింది. కానీ, ఈ విషయంలో భారత్కు నిరాశ తప్పలేదు. ఇప్పుడు ఎనిమిదేళ్ల నిరీక్షణను విజయంతో చెరిపేయాలని భారత్ భావిస్తోంది. రాబోయే 2019 ఏఎఫ్సీ ఆసియా కప్ ఈవెంట్లో భారత్కు సునీల్ చెత్రినే కెప్టెన్సీ వహిస్తాడు. ఈ మ్యాచ్లు జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరగనున్నాయి. కాగా ఈ ఎనిమిది మ్యాచ్లకు యూఏఈ వేదిక ఇవ్వనుంది.

సాధ్యమైనంత మేర ఆడి చూపిస్తాం
ఈ టోర్నీపై టీమిండియా కెప్టెన్ సునీల్ చెత్రి మాట్లాడుతూ.. మేము ఇంతకుముందెన్నడూ అలాంటి పెద్ద వేదికలపై ఆడింది లేదు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బహ్రెయిన్ వంటి దేశాలతో ఆడేందుకు ఇదే సరైన ప్రదేశం. మా వల్ల సాధ్యమైనంత మేర ఆడి చూపిస్తాం. ఇలాంటి పెద్ద జట్లతో ఆడుతున్నప్పుడు మేము సంతోషించం. ఎందుకంటే వాళ్లని ఎదుర్కోవాలంటే మేము ఇంకా మెరుగుపడాల్సి ఉంది'
12ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా
'మిగిలిన ఆసియా దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. కానీ, ఓ 15ఏళ్ల క్రితం టీమిండియాతో ఇప్పుడు పోల్చుకుంటే మాత్రం మనమే చాలా సాధించినట్లే. నాకు భారత్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 12ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.' అని పేర్కొన్నాడు.
నేనెప్పుడు నిశ్శబ్దంగా ఉండటానికే ఇష్టపడతా
'ఏఎఫ్సీ ఆసియా కప్లో ఆడటం మా బాధ్యత. మేము ఈ మ్యాచ్లో ఇంకా మెరుగవ్వాలని కోరుకుంటున్నా. నేనెప్పుడు నిశ్శబ్దంగా ఉండటానికే ఇష్టపడతా. ఎందుకంటే ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసనుకుంటున్నా. నా అనుభవాన్ని నా జూనియర్స్తో పంచుకోవడానికి ఎప్పుడూ వెనుకాడను. వాళ్లు మెరుగ్గా ప్రదర్శన ఇచ్చేందుకు సహకరిస్తా. గతంలో ఇలాంటి టోర్నీలో వచ్చిన ఫలితాల గురించి ఆలోచించను. ఈ టోర్నీలో రాణించడమే మా ముఖ్య ఉద్దేశ్యం'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications