హరారే మెట్రో పాలిటన్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్, మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్న రాజన్ నాయర్ తాజా ఉత్తర్వులు ప్రకారం క్రికెట్కి సంబంధించిన ఏ ఫార్మాట్లోనూ పాల్గొనకుండా చేసింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్ను ఫిక్స్ చేస్తే 30 వేల డాలర్లు వచ్చేలా చేస్తానంటూ గతేడాది కెప్టెన్ క్రీమర్కు రాజన్ ఆశచూపాడు
వెంటనే ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి క్రీమర్ తీసుకువెళ్లాడు. దీంతో దీనిపై దర్యాప్తు ప్రారంభంచిన ఐసీసీ చెందిన యాంటీ కరప్షన్ యూనిట్ ఓ నివేదిక రూపొందించింది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ఆర్టికల్ 2.11 నిబంధనను రాజన్ నాయర్ ఉల్లంఘించినట్లు విచారణలో అంగీకరించాడు.
దీంతో మంగళవారం ఐసీసీ తుది ప్రకటన చేసింది. ఈ సందర్భంగా క్రీమర్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీమర్ మాట్లాడుతూ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనుకునే వారికి ఇదొక సందేశంగా వెళుతుందని, అందుకే ఇలా చేశానని తెలిపాడు.