హైదరాబాద్: ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయడంతో పాటు తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహారించాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు.
50 బంతుల్లో సెంచరీ సాధించే సత్తా ఉంది: కేఎల్ రాహుల్కు గంభీర్ ప్రశంస
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (3), నవదీప్ సైని (2), కుల్దీప్ యాదవ్ (2) దెబ్బకు శ్రీలంక బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. మ్యాచ అనంతరం నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్లను చైనామన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరిని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగాడు.
MUST WATCH: @imShard and Navdeep Saini make their debut on CHAHAL TV 📺📺
— BCCI (@BCCI) January 8, 2020
From Shardul's 3-wicket haul to Saini’s scorching yorkers 🔥, @yuzi_chahal quizzes the pace duo 🙌 – by @28anand #TeamIndia
Full video here 📽️👉 https://t.co/GjBx50Ca13 pic.twitter.com/XZvAnRV8Bh
ఒకేరోజు రెండు హ్యాట్రిక్లు: బిగ్బాష్ లీగ్ చరిత్రలోనే మొదటిసారి (వీడియో)
"జస్ప్రీత్ బుమ్రాను యార్కర్ల రారాజు అంటారు. అంటే నువ్వు యార్కర్ల రాణివా?" అని సైనీని అడగటంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పూణె వేదికగా జరగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.