
పంత్ ఎంపికైతే నిరాశ చెందేవాడిని:
'జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుండి ప్రపంచకప్పై దృష్టి సారించా. అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే అవకాశం దక్కుతుందని భావించా. ఈ క్రమంలోనే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. జట్టులో అందరికి అవకాశం దక్కదు.. ఇది ఆటలో భాగం. ఒకవేళ పంత్ ఎంపికైతే నేను నిరాశ చెందేవాడిని. నేను ఎంపికయ్యా కాబట్టి అతను బాధపడుతున్నాడు' అని కార్తీక్ అన్నారు.

భవిష్యత్తులో జరుగుతుంది:
'రిషబ్ పంత్ దూకుడైన ఆటగాడు. చాలా రోజులు క్రికెట్ ఆడుతాడు. ప్రస్తుతం ధోనితో కలిసి నేను ఆడుతున్నాను. అలాగే నేను.. పంత్తో కలిసి ఆడుతా, డ్రెస్సింగ్ రూం పంచుకుంటా. భవిష్యత్తులో ఇది జరుగుతుంది. ఇద్దరం కలసి ఆడుతాం' అని కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేసారు.

స్టాండ్బై ఆటగాళ్లుగా ఎంపిక:
ప్రపంచకప్ కోసం అంబటి రాయుడు, పంత్, నవదీప్ సైనీలు స్టాండ్బై ఆటగాళ్లుగా ఉన్నారు. బ్యాట్స్మన్ జాబితాలో రిషబ్ పంత్ మొదటి స్టాండ్ బై కాగా.. అంబటి రాయుడు రెండో స్టాండ్ బైగా ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో నవదీప్ షైనీ ఒక్కడే. ప్రస్తుత జట్టులో ఎవరైనా గాయపడితే వీరు ఇంగ్లాండ్ విమానం ఎక్కనున్నారు.


Click it and Unblock the Notifications












