ఆరంభ సీజన్లో
దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2007 ఐసీసీ టీ20 వరల్డ్కప్ ఆరంభ సీజన్లో ధోని నాయకత్వంలోని టీమిండియా తొలి వరల్డ్కప్ను నెగ్గిన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ "2007లో టీ20 వరల్డ్కప్ ఆరంభ సీజన్లో టీమిండియా విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తిన రెండవ భారత కెప్టెన్ కావడం గౌరవంగా ఉంటుంది" అని అన్నాడు.
ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చేటప్పుడు
"అయితే, 2020 ఆరంభంలోనే భారత మహిళల జట్టు ట్రోఫీని గెలిస్తే మూడోది అవుతుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరిన్ని చూడాలని ఆశిస్తున్నాను" అని విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా నెగ్గలేదు.
ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవని కోహ్లీ
2017లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఫైనల్స్కు చేరినప్పటికీ... పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడంతో రన్నరప్గా మిగిలింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగులు తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు
భారత్ వేదికగా 2016లో చివరగా జరిగిన టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్లో వెస్టిండిస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లను టీ20 వరల్డ్కప్కు సన్నద్ధం చేస్తున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. 2020లో జరగనున్న టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనుంది.