పునరాగమనం తర్వాత స్మిత్ తొలి టెస్టు సెంచరీ
బాల్ టాంపరింగ్ పునరాగమనం తర్వాత స్టీవ్ స్మిత్కి ఇదే తొలి టెస్టు సెంచరీ. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ 2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 10 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన ఆసీస్
బర్న్స్ (4), జేసన్ రాయ్ (6) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు. ఓపెనర్లు వార్నర్ (2), బాన్క్రాఫ్ట్ (8)లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఖవాజా (13) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 35 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో స్మిత్, హెడ్ (35)తో కలిసి ఇన్నింగ్స్ను సరిదిద్దాడు.
లంచ్ విరామానికి 83/3
లంచ్ విరామానికి ఆసీస్ 83/3తో నిలిచింది. స్టువర్ట్ బ్రాడ్తో వోక్స్ విజృంభించడంతో ఆసీస్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. హెడ్తో పాటు వేడ్ (1), పైన్ (5), పాటిన్సన్ (0), కమిన్స్ (5) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 23 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ స్కోరు కనీసం 150 పరుగులైనా దాటుతుందా అనిపించింది.
పీటర్ సిడిల్ నుంచి అనూహ్య మద్దతు
ఇలాంటి పరిస్థితుల్లో స్మిత్కు లోయర్ ర్డర్ బ్యాట్స్మెన్ పీటర్ సిడిల్ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. వీరిద్దరి తొమ్మిదో వికెట్కు 88 పరుగులు జత చేయడంతో ఆసీస్ 210/8తో కోలుకుంది. కానీ సిడిల్ను అలీ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదనిపించింది.
5 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్
అయితే, స్మిత్ పట్టువదలకుండా నాథన్ లియాన్(12 నాటౌట్)తో కలిసి చివరి వరకు పోరాడాడు. ఈ క్రమంలో 184 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్ను బ్రాడ్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆఖరి వికెట్కు లైయన్తో కలిసి స్టీవ్ స్మిత్ 74 పరుగులు జోడించడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ (5/86), క్రిస్ వోక్స్ (3/58) అద్భుత ప్రదర్శన చేశారు.