పంత్ అద్భుత ఆటగాడు
"అయితే, రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడని... అతడిని ఒత్తిడిలోకి నెట్టినా... మా ప్రణాళికలను అమలు చేయనివ్వకుండా చేశాడు" అని విలియమ్సన్ అన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
విలియమ్సన్ మాట్లాడుతూ
దీనిపై విలియమ్సన్ మాట్లాడుతూ "మేం నిర్దేశించింది మంచి లక్ష్యమే. ఈ పిచ్పై ఎంత కావాలో అంత లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచాం. అయితే ఢిల్లీ బ్యాట్స్మెన్ సమష్టిగా ఆడారు. ఈ విజయానికి వాళ్లు పూర్తి అర్హులు. ఢిల్లీ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ జట్టుగా రాణించారు. మేం బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో అవకాశాలు జారవిడిచాం" అని అన్నాడు.
వందశాతం రాణించామని చెప్పడం లేదు
"ఈ మ్యాచ్లో వందశాతం రాణించామని చెప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కీలకమైన మ్యాచుల్లో ప్రతీ ఆటగాడు రాణించాల్సి ఉంటుంది. కానీ, మా జట్టులో అలా జరగలేదు. డేవిడ్ వార్నర్, బెయిర్స్టో లేకుండా బరిలో దిగిన మ్యాచ్ల్లోనూ బాగానే ఆడాం. అయితే, అన్ని ప్రతి మ్యాచ్లో దాదాపు విజయతీరాలకు వచ్చి ఓడిపోయాం. వచ్చే సీజన్లో మరింత రాణించేందుకు కృషి చేస్తాం" అని కేన్ విలియమ్సన్ చెప్పాడు.
ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోవడం మూడో సారి
ఇదిలా ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోవడం మూడో సారి. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఫైనల్లో అడుగుపెట్టిన సన్రైజర్స్ 2016తో టైటిల్ విజేతగా నిలవగా.... 2018లో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది.