బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఆసీస్ తమ ఓవర్నైట్ స్కోరుకు మూడు పరుగులు మాత్రమే జత చేసింది. ఫలితంగా తమ రెం డో ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. బాక్సింగ్ డే టెస్టులో 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
|
అభిమానికి ప్యాడ్స్ గిప్ట్గా ఇచ్చిన కోహ్లీ
టెస్టు ఫార్మాట్లో టీమిండియాకిది 150వ విజయం కావడం విశేషం. కాగా, మ్యాచ్ గెలిచిన ఆనందంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను ఉత్సాహాపరిచాడు. ఈ క్రమంలో గ్యాలరీలో ఉన్న ఓ చిన్నారి అభిమాని వద్దకు వెళ్లి తన ప్యాడ్లను గిప్ట్గా అతడికి అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
|
స్టేడియం మొత్తం కలియదిరుగుతూ
బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన వెంటనే భారత జట్టు క్రికెటర్లు అంతా వికెట్లను చేతబట్టి స్టేడియం మొత్తం కలియదిరుగుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. కోహ్లీ అయితే పెద్దగా చప్పట్లు చరుస్తూ అభిమానులను ఉత్తేజపరిచాడు. పెవిలియన్కు వెళుతూ అభిమానులకు ఆటోగ్రాఫ్ సైతం ఇచ్చారు.
|
డ్రెస్సింగ్ రూమ్లో తమదైన శైలిలో సంబరాలు
మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో తమదైన శైలిలో సంబరాలు కూడా చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే, ఈ సిరిస్లో చివరిదైన ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.