|
50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు ఛేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 26.1 ఓవర్లు ముగిసే సమయానికి 132/9 పరుగులతో నిలిచింది. ఈ సమయంలో మ్యాచ్కి వర్షం అడ్డంకిగా మారింది.
|
వర్షం రావడంతో మైదానాన్ని వీడిన ఇరు జట్ల ఆటగాళ్లు
వర్షం రావడంతో ఇరుజట్ల క్రికెటర్లు మైదానాన్ని వీడారు. అయితే, అంపైర్ అలీందార్ మాత్రం మైదానంలోనే ఉండిపోయాడు. దీనికి కారణం వర్షం మరికొద్ది క్షణాల్లో వస్తుందనగా అలీందార్ ఇచ్చిన ఔట్ (ఎల్బీ)ని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఫ్లంకెట్ సవాల్ చేస్తూ డీఆర్ఎస్కి వెళ్లాడు.
|
ప్లంకెట్ డీఆర్ఎస్ అడగడం...
ప్లంకెట్ డీఆర్ఎస్ అడగడం... అదే సమయంలో థర్డ్ అంపైర్ టీవీ రిప్లై చూస్తుండగా వర్షం మొదలైంది. దీంతో ఫీల్డ్ అంపైర్ బాధ్యత నిర్వర్తించేందుకు మైదానంలోనే ఉన్న అలీందార్.. రిప్లైలో బంతి వికెట్లను తాకేలా కనిపించడంతో.. ఔట్ నిర్ణయం ప్రకటించిన తర్వాతే మైదానం నుంచి బయటకు వెళ్లాడు.
|
ఔట్ అని వేలెత్తి అలానే.. బౌండరీ లైన్ వరకు
వర్షం కారణంగా.. స్కోరర్కి తన నిర్ణయం కనబడదేమో? అని అలీందార్ ఔట్ అని వేలెత్తి అలానే.. బౌండరీ లైన్ వరకూ పరుగెత్తుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియాని చూసిన అభిమానులు అలీందార్ నిబద్ధతపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంక 219 పరుగుల తేడాతో గెలిచినట్లు అంఫైర్లు ప్రకటించారు.