214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. దీంతో మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్ కోసమే ఎక్కువగా ప్రయత్నించాడు.
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో
ఈ క్రమంలో ఢిల్లీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో బంతిని మిడాన్ దిశగా ఆడి సింగిల్ కోసం పరుగెత్తగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ బంతిని అందుకుని నేరుగా వికెట్లపైకి విసిరాడు. అయితే, క్షణాల వ్యవధిలో సూర్యకుమార్ నాన్స్ట్రైక్ ఎండ్లోని క్రీజులోకి రావడంతో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.
|
నిరాశగా పెవిలియన్కు చేరిన సూర్యకుమార్
ఆ తర్వాతి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్లో మిడాఫ్ దిశగా బంతిని పుష్ చేసి సింగిల్ కోసం పరుగెత్తాడు. ఈసారి శ్రేయాస్ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. వేగంగా బంతిని అందుకుని వికెట్లపైకి విసిరేశాడు. దీంతో క్రీజుకి చాలా దూరంలో ఉండిపోయిన సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్కు చేరాడు.
37 పరుగుల తేడాతో ముంబై ఓటమి
ఆ తర్వాత క్రీజులోకి వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్లో యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్య (0) కూడా ఔటవడంతో మ్యాచ్పై ముంబయి పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసి 37 పరుగుల తేడాతో ఓడింది.