|
భారీ సిక్సర్తో డబుల్ సెంచరీ
శుక్రవారం నాటి మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని అనంతరం ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వైపు బ్యాట్ చూపిస్తూ అభివందనం చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ డబుల్ సెంచరీ చేశానని చేతివేళ్లతో కెప్టెన్ కోహ్లీకి సైగలు చేశాడు.
|
మూడు వేళ్లను చూపిస్తూ ట్రిపుల్ సెంచరీ బాదాలని
దీనికి చిరునవ్వుతో స్పందించిన కెప్టెన్ కోహ్లీ మూడు వేళ్లను చూపిస్తూ ట్రిపుల్ సెంచరీ బాదాలని సూచించాడు. అయితే, ట్రిపుల్ సెంచరీ చేయాలన్న కసితో దూకుడుగా ఆడే క్రమంలో యమాంక్ అగర్వాల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. మెహదీ హసన్ బౌలింగ్లో జయేద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
|
కోహ్లీ కోరికను తీర్చలేకపోయిన మయాంక్
దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరిన కోరికను మయాంక్ అగర్వాల్ తీర్చలేకపోయాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లి(ఐదు ఇన్నింగ్స్ల్లో రెండు డబుల్ సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు.
|
13 ఇన్నింగ్స్ల్లో బ్రాడ్మన్ రెండు డబుల్ సెంచరీలు
ఆస్ట్రేలియా లెజెండర్ బ్యాట్స్మన్ డాన్ బ్రాడ్మన్ 13 ఇన్నింగ్స్ల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఇక టెస్టుల్లో రెండు ద్విశతకాలు బాదిన కోహ్లీ, వినూ మన్కడ్, వసీమ్ జాఫర్ సరసన నిలిచాడు. ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో 700కుపైగా పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(630), క్వింటన్ డీకాక్(629), బెన్ స్టోక్స్(627) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.