కోహ్లీకి విశ్రాంతి
బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు బంగ్లాదేశ్తో జరగనున్న మూడు టీ20ల సిరిస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చేందుకు జట్టు మేనేజ్మెంట్ సిద్ధమైంది. "అవును, ఆస్ట్రేలియా సిరిస్, ఐపీఎల్, వరల్డ్కప్, వెస్టిండిస్లో పర్యటన, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరిస్ ఇలా... కోహ్లీ నాన్ స్టాఫ్గా క్రికెట్ ఆడుతుండటంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం" అని తెలిపారు.
పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని
"ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని... ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావించాం. విశ్రాంతి ఇవ్వడం వల్ల ఆటగాళ్ళు కూడా తాజాగా ఉంటారు. వారి ఆట పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు" అని తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన మరుసటి రోజునే బంగ్లాదేశ్తో టీ20 సిరిస్కు జట్టుని ఎంపిక చేయనున్నారు.
అక్టోబర్ 23న బాధ్యతలు
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ధోనిపై భవితవ్వంపై సెలెక్టర్లతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామని గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్ ముగిసిన తర్వాత నుంచి ధోని విశ్రాంతి తీసుకుంటున్నాడు.
టెస్టు సిరిస్కు అందుబాటులో
టీ20 సిరిస్ అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా బంగ్లాదేశ్తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్కు తిరిగి కోహ్లీ జట్టులోకి వస్తాడని తెలిపారు. "అవును, విరాట్ కోహ్లీ బంగ్లాతో జరగబోయే రెండు టెస్టులకు జట్టులో తిరిగి వస్తాడు" అని తెలిపాడు. ఎందుకంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియాను విజేతగా నిలబెట్టేందుకు కోహ్లీ ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించుకున్నాడు.