న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

400వ మ్యాచ్: విశాఖ వన్డేలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

IND vs WI 2019 : Virat Kohli Appears In 400th Match For India ! || Oneindia Telugu
Virat Kohli set to make 400th international appearance when India take on West Indies in 2nd ODI in Vizag

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డుకి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ తరుపున 400 మ్యాచ్‌లు ఆడిన ఎనిమిదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 400వ మ్యాచ్. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 399 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 84 టెస్టులు, 240 వన్డేలు, 75 టీ20లు ఉన్నాయి.

<strong>గత రెండేళ్లలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో: మరో ప్రపంచ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ</strong>గత రెండేళ్లలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో: మరో ప్రపంచ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

400 మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ

400 మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ

కాగా, 400 మ్యాచ్‌లు అంతకంటే ఎక్కువ ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ధోని, రాహుల్ ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, కుంబ్లే, యువరాజ్ సింగ్‌లు ఉన్నారు. విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా ఒత్తిడితో బరిలోకి దిగనుంది.

సిరిస్‌లో ఉండాలంటే

సిరిస్‌లో ఉండాలంటే

సిరిస్‌లో ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి. ఈ నేపథ్యంలో విశాఖ వన్డేలో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వెస్టిండిస్ ఉంది. విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది.

5 మ్యాచ్‌ల్లో 556 పరుగులు

5 మ్యాచ్‌ల్లో 556 పరుగులు

ఆ ఓటమి కూడా వెస్టిండిస్ చేతిలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్‌ టై కాగా మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది. ఇక్కడ చివరగా ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. మరోవైపు విశాఖ స్టేడియంలో కోహ్లీకి మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. ఇక్కడ కోహ్లీ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 556 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీమిండియా తరుపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే:

టీమిండియా తరుపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే:

* సచిన్ టెండూల్కర్- 664 (ఇండియా)

* ఎంఎస్ ధోని- 538 (ఇండియా / ఆసియా)

* రాహుల్ ద్రవిడ్- 509 (ఇండియా / ఆసియా / ఐసిసి)

* మహ్మద్ అజారుద్దీన్- 433 (ఇండియా)

* సౌరవ్ గంగూలీ- 424 (ఇండియా / ఆసియా)

* అనిల్ కుంబ్లే- 403 (ఇండియా / ఆసియా)

* యువరాజ్ సింగ్- 402 (ఇండియా / ఆసియా)

* విరాట్ కోహ్లీ- 400 * (ఇండియా)

Story first published: Wednesday, December 18, 2019, 13:24 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X