
400 మ్యాచ్లు అంతకంటే ఎక్కువ
కాగా, 400 మ్యాచ్లు అంతకంటే ఎక్కువ ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ధోని, రాహుల్ ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, కుంబ్లే, యువరాజ్ సింగ్లు ఉన్నారు. విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా ఒత్తిడితో బరిలోకి దిగనుంది.

సిరిస్లో ఉండాలంటే
సిరిస్లో ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో తప్పక నెగ్గాలి. ఈ నేపథ్యంలో విశాఖ వన్డేలో విజయం సాధించి సిరీస్పై ఆశలు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వెస్టిండిస్ ఉంది. విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది.

5 మ్యాచ్ల్లో 556 పరుగులు
ఆ ఓటమి కూడా వెస్టిండిస్ చేతిలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్ టై కాగా మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది. ఇక్కడ చివరగా ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. మరోవైపు విశాఖ స్టేడియంలో కోహ్లీకి మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. ఇక్కడ కోహ్లీ ఆడిన 5 మ్యాచ్ల్లో 556 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీమిండియా తరుపున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు వీరే:
* సచిన్ టెండూల్కర్- 664 (ఇండియా)
* ఎంఎస్ ధోని- 538 (ఇండియా / ఆసియా)
* రాహుల్ ద్రవిడ్- 509 (ఇండియా / ఆసియా / ఐసిసి)
* మహ్మద్ అజారుద్దీన్- 433 (ఇండియా)
* సౌరవ్ గంగూలీ- 424 (ఇండియా / ఆసియా)
* అనిల్ కుంబ్లే- 403 (ఇండియా / ఆసియా)
* యువరాజ్ సింగ్- 402 (ఇండియా / ఆసియా)
* విరాట్ కోహ్లీ- 400 * (ఇండియా)


Click it and Unblock the Notifications












