2017 జనవరి 15న
2017 జనవరి 15న భారత్-ఇంగ్లాండ్ మధ్య పుణె వేదికగా వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కోహ్లీ 105 బంతుల్లో 122 పరుగులు చేసి వన్డే కెరీర్లో 27వ సెంచరీని నమోదుచేశాడు. అంతేగాక, ఆ ఏడాది కోహ్లీకి అదే తొలి సెంచరీ. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
2018 జనవరి 13-17 తేదీల్లో
2018 జనవరి 13-17 తేదీల్లో సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ జరిగింది. రెండో టెస్టు మూడో రోజైన జనవరి 15న కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ ఇన్నింగ్స్లో కోహ్లీ 153 పరుగులు చేశాడు. 2018లో కోహ్లీ ఇదే తొలి సెంచరీ. అయితే, ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది.
|
రెండో వన్డేలో
తాజాగా 2019 జనవరి 15న(మంగళవారం) అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 104 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్లో ధోని ఫినిషింగ్ టచ్తో విజయం భారత్నే వరించింది.
|
తన తొలి సెంచరీని జనవరి 15నే
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్మెన్ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ, మాక్స్వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఇలా గత మూడేళ్లుగా కోహ్లీ ఏడాదిలో తన తొలి సెంచరీని జనవరి 15నే సాధించడంతో ఈ రోజు ప్రత్యేకంగా నిలుస్తోంది.