ధోనీ రికార్డు బద్దలు:
ఈ టెస్ట్ విజయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగానూ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ 48 టెస్టులకు సారథ్యం వహించి.. టీమిండియాకు 28 విజయాలు అందించాడు. దీంతో ధోనీ రికార్డును బద్దలు కొట్టి అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ల అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్గా రికార్డులోకి ఎక్కాడు.
అత్యంత విజయవంతమైన కెప్టెన్:
ధోనీ తన కెరీర్లో 60 టెస్టులకు సారథిగా వ్యవహరించి 27 మ్యాచ్ల్లో గెలిపించాడు. ఇందులో ఓటమి-18, డ్రా-15 ఉన్నాయి. ఇక విజయాల శాతం 45. కోహ్లీ 48 టెస్టులకు నాయకత్వం వహించి 28 మ్యాచ్ల్లో భారత్కు విజయాలు అందించి ధోనీని అధిగమించాడు. ఇందులో 10 ఓటమి, డ్రా-10లు ఉన్నాయి. విజయాల శాతం 55.31. సౌరభ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టుల్లో 21 గెలువగా.. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో 47 మ్యాచ్ల్లో 14 గెలుపొందింది.
టాప్లో స్టీవ్ వా:
48 టెస్టుల తర్వాత అత్యధిక టెస్టు మ్యాచ్లు గెలిచిన కెప్టెన్ల జాబితాలో స్టీవ్ వా (36), రికీ పాంటింగ్ (33)లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. 28 విజయాలతో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ (27) నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీకి ఇంకా చాలా కెరీర్ ఉన్న నేపథ్యంలో పాంటింగ్, స్టీవ్ వాలను కూడా అధిగమించే అవకాశం ఉంది.
చార్జ్షీట్ను పరిశీలించేవరకు షమీపై ఎటువంటి చర్యలు తీసుకోము: బీసీసీఐ
2014లో టెస్టు పగ్గాలు:
2014లో ధోని నుంచి టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అతడు టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై స్వదేశంలో గెలుపొందడంతో పాటు.. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ నెగ్గి 71 ఏళ్లుగా భారత్కు అందని ద్రాక్షగా ఉన్న కలను సాకారం చేశాడు. అంతేకాకుండా విదేశాల్లో అత్యధిక టెస్టు మ్యాచ్లు గెలిచిన కెప్టెన్గా సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును కూడా కోహ్లీ అధిగమించాడు.