ఇంగ్లీషు గడ్డపై శిఖర్ ధావన్ పూర్తిగా విఫలం
ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లు ఆడాల్సి ఉంది. అయితే, ఇంగ్లీషు గడ్డపై శిఖర్ ధావన్ చేసిన ప్రదర్శనను బట్టి సెలక్టర్లు మళ్లీ అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. మరోవైపు ఇదే పర్యటనలో ధావన్తో పాటు విఫలమైన మరో ఓపెనర్ మురళీ విజయ్పై చివరి రెండు టెస్టుల్లో సెలక్టర్లు వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఓపెనర్గా పృధ్వీ షాను ఎంపిక
ఈ క్రమంలో చివరి రెండు టెస్టుల్లో అతడి స్థానంలో యువ ఓపెనర్ పృధ్వీ షాను ఎంపిక చేశారు. అయితే, అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కావడంతో చివరి రెండు టెస్టుల్లో శిఖర్ ధావన్వైపే టీమిండియా జట్టు మేనేజ్మెంట్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఐదో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
ఓవల్ వేదికగా ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించి ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. శిఖర్ ధావన్ మాత్రం ఘోరంగా విఫలమైన తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. దీంతో కేఎల్ రాహుల్ వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో పృధ్వీ షా బరిలోకి దిగే అవకాశం ఉంది.
లంచ్ విరామ సమయానికి భారత్ 167/5
కాగా, ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు, ఆఖరి రోజున లంచ్ విరామ సమయానికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(108), రిషబ్ పంత్(12) పరుగులతో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో 423 పరుగులు చేసిన ఇంగ్లాండ్ భారత్కు 464 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది.