మా లక్ష్యం బంగ్లాదేశ్:
మ్యాచ్ అనంతరం టిమ్ పైన్ మాట్లాడుతూ... 'స్వదేశంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ సిరీస్లను క్లీన్స్వీప్ చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం మా తదుపరి లక్ష్యం బంగ్లాదేశ్. ఆ తర్వాత భారత్. రెండు టెస్టుల సిరీస్ కోసం జూన్లో బంగ్లాదేశ్కు వెళుతున్నాం. అక్కడ విజయాలు సాధించి టీమిండియా సిరీస్పై దృష్టి పెడతాం' అని అన్నాడు.
బ్యాటింగ్ దుర్బేద్యం:
'గత టెస్టు సిరీస్లో టీమిండియా 2-1 తేడాతో గెలుపొందింది. అయితే అప్పటి జట్టు పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నాం. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్లతో బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. పేస్, స్పిన్తో ప్రత్యర్థి ఆటగాళ్లను చిక్కుల్లో పడేసే బౌలర్లు ఉన్నారు' అని పైన్ పేర్కొన్నాడు.
ఆత్రుతగా ఎదురుచూస్తున్నా:
'టీమిండియాతో జరగబోయే టెస్టు సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ కారణంగా ఈ సిరీస్ ఇరు జట్లుకు కీలకం. ఎవరు గెలిస్తే వారికి లాభం. టీమిండియాపై టెస్టు సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ ఆరాటపడుతుతున్నారు. అందుకే టీమిండియాతో సిరీస్ కోసం మేమందరం వేచిచూస్తున్నాం' అని పైన్ చెప్పుకొచ్చాడు.
టెస్టు చాంపియన్ షిప్లో 296 పాయింట్లు:
న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్ను కూడా 2-0తో కైవసం చేసుకుంది. దీంతో ఆసీస్ ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో 296 పాయింటలతో టీమిండియా (360) తరువాతి స్థానంలో ఉంది. టీ20 ప్రపంచకప్ ముగిశాక టీమిండియా టెస్టులపై ఫోకస్ పెట్టనుంది. వరుసగా టెస్టు సిరీస్లు ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది.