సరైన సమయంలో
"సరైన సమయంలో తన సత్తా ఏంటో చూపించాడు. విజయం కోసం అందరం కష్టపడ్డాం. ఇది మాకు ప్రత్యేకమైన రోజు. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో మేం ఆసీస్ను కట్టడి చేశాం. మ్యాక్స్వెల్, మార్ష్ల వికెట్లు పడగొట్టిన ఆ రెండు బంతులు అద్భుతం. బంతితో భువీ చాలా బాగా రాణించాడు. అతను ఫామ్లోకి వచ్చి మాకు అండగా నిలిచాడు" అని కోహ్లీ అన్నాడు.
అద్భుత ప్రదర్శన
"చివర్లో ధోని-కార్తీక్ జోడీ అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి సమయంలో బ్యాటింగ్కు వచ్చిన కార్తీక్ బాగా రాణించాడు. ఈ రోజు మాకు చాలా కఠినంగా గడిచింది. ఉక్కపోతతో మా దుస్తులు ఉప్పుతో నిండిపోయాయి. తీవ్రంగా అలసిపోయాం. విరామాన్ని ఆస్వాదించి చివరి మ్యాచ్కు సిద్ధమవుతాం" అని కోహ్లీ పేర్కొన్నాడు.
రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
మూడు వన్డేల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్లో ధోని ఫినిషింగ్ టచ్తో విజయం భారత్నే వరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్మెన్ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు.
షాన్ మార్ష్ సెంచరీ
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ, మాక్స్వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలమయ్యాడు.
1-1తో సిరిస్ సమం
వికెట్ ఏమీ తీయకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.