For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు: కోహ్లీని వెనక్కినెట్టిన రైనా

By Nageshwara Rao
Suresh Raina edges past Virat Kohli to become leading IPL run-scorer

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాల మధ్య పరుగుల వేట మొదలైంది. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరిచారు. అయితే, ఐపీఎల్ ఆరంభమైన కొద్దిరోజులకే గాయం కారణంగా సురేశ్ రైనా కీలకమ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆ తర్వాత గాయం నుంచి సురేశ్ రైనా కోలుకోవడం... పరుగుల వరద పారించడంతో తాజాగా సురేశ్‌ రైనా... విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఈ సీజన్‌లో లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో నిలిచింది.

ఫలితంగా చెన్నై ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా మంగళవారం తొలి క్యాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబైలోని వాంఖడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రైనా 22 పరుగులు చేశాడు. లీగ్‌ దశ ముగిసే సమయానికి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీని రైనా వెనక్కి నెట్టాడు.

 అగ్రస్థానంలో సురేశ్ రైనా

అగ్రస్థానంలో సురేశ్ రైనా

4,952 పరుగులతో సురేశ్ రైనా అగ్రస్థానంలో నిలిచాడు. విరాట్‌ కోహ్లీ (4,948), రోహిత్‌ శర్మ (4,493), గౌతమ్‌ గంభీర్‌ (4,217), రాబిన్ ఉతప్ప (4,081) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

140 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించిన చెన్నై

140 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించిన చెన్నై

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఫా డుప్లెసిస్(42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సులు)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి మూడు ఓవర్లలో చెన్నై విజయానికి 43 పరుగులు అవసరమైన తరుణంలో డుప్లెసిస్‌ చెలరేగాడు.

 చెన్నై విజయంలో డుప్లెసిస్ కీలకపాత్ర

చెన్నై విజయంలో డుప్లెసిస్ కీలకపాత్ర

బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే విజయాని కావాల్సిన స్కోరును తగ్గించుకుంటూ వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా, డుప్లెసిస్‌ తొలి బంతినే సిక్స్‌ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌(15 నాటౌట్‌) చక్కటి సహకారం అందించడంతో చెన్నై ఐదు బంతులుండగానే విజయం సాధించింది.

సన్‌రైజర్స్‌కు మరో అవకాశం

సన్‌రైజర్స్‌కు మరో అవకాశం

ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్... ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. శుక్రవారం (మే 25)న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా భువీకి ఒక వికెట్ తీసుకున్నాడు.

వచ్చే ఏడాది ఐపీఎల్‌ వరకు రైనానే

వచ్చే ఏడాది ఐపీఎల్‌ వరకు రైనానే

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. కాగా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఈ ఏడాది ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోలేదు. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్‌ వరకు రైనానే అగ్రస్థానంలో కొనసాగనున్నాడు. అంతేకాదు ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లోనూ 300లకు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రైనా అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Wednesday, May 23, 2018, 14:41 [IST]
Other articles published on May 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+