హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. ప్రతిష్టాత్మక ఐదు టెస్టు మ్యాచ్ల యాషెస్ సిరిస్ను స్టీవ్ స్మిత్ నేతృత్వంలోన ఆస్ట్రేలియా జట్టు 4-0తో కైవసం చేసుకున్న నేపథ్యంలో అతడిని కాంప్టన్-మిల్లర్ మెడల్ వరించింది.
687 runs at an average of 137.40.
— ICC (@ICC) January 8, 2018
3 centuries, 2 fifties.
High score of 239.
No surprise, @stevesmith49 is the #Ashes Player of the Series! 🙌 pic.twitter.com/AU8uUMnfo1
సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ జట్టుపై ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 123 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ను ఆస్ట్రేలియా 4-0తో జేజిక్కించుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ సిరిస్లో స్టీవ్ స్మిత్ 137.40 యావరేజితో 687 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. స్మిత్ తర్వాత షాన్ మార్ష్ 242 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆసీస్కు వరుస విజయాలను అందించిన స్మిత్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని సైతం అందుకున్నాడు.
ఈ సిరిస్లో స్టీవ్ స్మిత్ పెర్త్ వేదికగా జరిగిన మూడో టెస్టులో డబుల్ సెంచరీ (239) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా, 5 మ్యాచుల సిరీస్ను 4-0తో ఆసీస్ కైవసం చేసుకోవడంతో 104 పాయింట్లతో తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో 3వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఇంగ్లాండ్ ఐదో స్థానానికి పడిపోయింది.
ఇక, ఎప్పటిలాగే 124 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Find yourself someone who looks at you like Steve Smith looks at the #Ashes urn 😍 pic.twitter.com/cwdz0yLCZ6
— ICC (@ICC) January 8, 2018
4️⃣-👌 #Ashes pic.twitter.com/QE0R5HHY4D
— ICC (@ICC) January 8, 2018