|
మలింగ ఆడిన వన్డే మ్యాచ్ల్లో
గత రెండు సంవత్సరాలుగా మలింగ ఆడిన వన్డే మ్యాచ్ల్లో శ్రీలంక ఒకే మ్యాచ్లో విజయం సాధించగా 21 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక, టీ20 మ్యాచ్ల విషయానికి వస్తే ఈ రికార్డు మరీ దారుణంగా ఉంది. శ్రీలంక ఆడిన ఆరు టీ20ల్లోనూ ఓటమి పాలైంది.
|
187 పరుగుల లక్ష్య చేధనలో
మంగళవారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య చేధనలో ఆప్ఘనిస్థాన్ ఆరంభం నుంచి తడబడింది. లంక పేసర్లు విజృంభించడంతో ఆ జట్టు 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. చివర్లో నజిబుల్లా(43), నయిబ్ (23) క్రీజులో ఉండటంతో ఆఖరి వరకు ఆప్ఘన్ పోటీలోనే ఉంది.
|
వర్షం కారణంగా
ఎప్పుడైతే నజిబుల్లా రనౌట్ అయ్యాడో ఆ తర్వాత ఆప్ఘన్ కథ ముగిసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ని 41 ఓవర్లలో 187 పరుగులకు కుదించారు. ఆప్ఘన్ జట్టు 32.4 ఓవర్లలో 152 పరుగులకే పరిమితమై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నబి (4/30), రషీద్ఖాన్ (2/17) ధాటికి 36.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది.
|
మ్యాచ్ 41 ఓవర్లకు కుదింపు
ఈ మ్యాచ్లో ఆప్ఘన్ బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక 33 ఓవర్లలో 189/8తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో వర్షం కురియడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత లంక ఇన్నింగ్స్కు 41 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత శ్రీలంక 18 పరుగులే జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది.