భువీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న థంపి
గురువారం రాత్రి భువీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న థంపి.. తాను వేసిన నాలుగు ఓవర్లలో 19,18,14,19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్లో ఇప్పటికి వరకు ఇషాంత్ శర్మ పేరు మీదున్న ఈ చెత్తరికార్డును థంపి బద్దలు కొట్టాడు. 2013లో జరిగిన ఐపీఎల్లో ఇషాంత్ శర్మ మొత్తం 66 పరుగులిచ్చాడు.
ఇషాంత్ శర్మ రికార్డుని బద్దలు కొట్టిన థంపి
ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇదే అత్యధికం కాగా ఇప్పుడు థంపి ఆ రికార్డుని అధిగమించాడు. ఇషాంత్ శర్మ తర్వాత ఉమేశ్ యాదవ్ (0/65), సందీప్ శర్మ(1/65), వరుణ్ ఆరోన్ (2/63), అశోక్ దిండా(0/63)లు అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. ఈ సీజన్లో సన్రైజర్స్కు ఇది నాలుగో ఓటమి కావడం విశేషం.
218 పరుగులు చేసిన బెంగళూరు
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాట్స్మెన్లలో డివిలియర్స్ (39 బంతుల్లో 69), మొయిన్ అలీ (34 బంతుల్లో 65), గ్రాండ్హోమ్ (17 బంతుల్లో 40) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది.
14 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి
అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు పోరాడి 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హైదరాబాద్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్లు), మనీశ్ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) చివరి వరకు పోరాడినా విజయం బెంగళూరునే వరించింది.