46 బంతుల్లోనే 72 పరుగులు చేసిన ధోని
ఈ పర్యటనలో భాగంగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 288 పరుగులు చేసింది. అనంతరం 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు.. ధోని 46 బంతుల్లోనే 72 పరుగులు చేయడంతో అలవోక విజయాన్ని అందుకుంది.
భారత్-పాక్ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించిన ముషారఫ్
ఆ మ్యాచ్ని అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన ధోనిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' లభించింది. ఈ అవార్డుని ధోనికి అందజేసే సమయంలో ముషారఫ్ మాట్లాడుతూ "స్టేడియంలోని చాలా మంది ధోనీ హెయిర్ కట్ చేసుకోవాల్సిందిగా ప్లకార్డ్లు ప్రదర్శించారు. ధోనీకి నా సలహా ఏంటంటే? ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హెయిర్ కట్ చేయించుకోకు" అని సరదాగా వ్యాఖ్యానించాడు.
ధోని ఆటతీరుకు ముగ్ధుడైన ముషారఫ్
ఆ మ్యాచ్లో ధోని ఆటతీరుకు ముగ్ధుడైన ముషారఫ్ గంగూలీని ఓ సరదా ప్రశ్న అడిగాడట. ఈ విషయాన్ని తాజాగా గంగూలీ వెల్లడించాడు. "పర్వేజ్ ముషారఫ్ ఆరోజు ధోనీ గురించి అడిగిన ప్రశ్న నాకు ఇప్పటికీ గుర్తుంది. సరదాగా మాట్లాడుతూ.. ధోనీని ఎక్కడ నుంచి పట్టుకొచ్చావ్..? అని అడిగారు. దానికి నేను.. వాఘా సరిహద్దులో నడుస్తుంటే మేము అతడ్ని మా దేశంలోకి లాగేశాం" అని సరదాగా బదులిచ్చానని గంగూలీ తెలిపాడు.
2004లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో
గంగూలీ నాయకత్వంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ధోనీ అరంగేట్రం చేశాడు. 2004లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధోని తొలి మ్యాచ్లోనే డకౌటయ్యాడు. తన తొలి మ్యాచ్లో విఫలమైనా... ధోనిపై నమ్మకం ఉంచిన గంగూలీ, మద్దతుగా నిలవడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లోనూ ముందుకు పంపించాడు. ఆ తర్వాత ధోని టీమిండియా కెప్టెన్గా రాణించడంతో పాటు భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన సంగతి తెలిసిందే.