గంగూలీ సోదరుడికి పాజిటివ్:
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. తాజాగా దాదా కుటుంబ సభ్యుల్లోని మరో ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గంగూలీ సోదరుడు, మాజీ రంజీ క్రికెటర్ స్నేహశీష్కు కరోనా పాజిటివ్ అని తేలింది. స్నేహాశిష్ భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. స్నేహాశిష్ రంజీ ట్రోఫీ ఆటగాడు. ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో సౌరవ్ గంగూలీ తన సోదరుడితో పాటు బెంగాల్ తరఫున ఆడాడు.
స్నేహాశిష్ అత్తమామలు కూడా:
స్నేహాశిష్ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే స్నేహాశిష్ అత్తమామలు కూడా వైరస్ బారినపడ్డారు. వీరందరూ ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్నారు. బెంగాల్కు చెందిన ఒక సీనియర్ అధికారి పీటీఐతో మాట్లాడుతూ... 'దాదా కుటుంబంలోని నలుగురు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఫిర్యాదు చేసారు. టెస్టుల్లో వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్నారు. ఇంటికి ఎప్పుడు పంపిస్తామనేది.. చికిత్సకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. స్నేహాశిష్ కుటుంబం బెహాలాలోని గంగూలీ యొక్క పూర్వీకుల ఇంట్లో ఉండడం లేదు' అని తెలిపారు.
అఫ్రిది పాజిటివ్:
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది గతవారం కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాను మహమ్మారి నుంచి కోలుకుంటున్నట్లు తాజాగా అఫ్రిది తెలిపాడు. ఫేస్బుక్ వేదికగా ఓ వీడియో షేర్ చేసిన అఫ్రిది.. అసత్య వార్తలను నమ్మవద్దని, తన గురించి భయపడాల్సిన అవసరంలేదని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇక పశ్చిమ బెంగాల్ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,090 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో మహమ్మారితో పోరాడుతూ 7,303 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 529 మంది మరణించారు.