118 మ్యాచ్ల్లో ఈ మైలురాయిని
విరాట్ కోహ్లీ 114 మ్యాచ్ల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోగా, శిఖర్ ధావన్ 118 మ్యాచ్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ వన్డేకు ముందు పది పరుగుల దూరంలో ఉన్న శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో టిమ్ సౌథీ బౌలింగ్లో సింగిల్ తీసి ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా
వన్డేల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న వారి జాబితాలో హషీం ఆమ్లా (101 మ్యాచ్లు), వివియన్ రిచర్డ్స్ (114), విరాట్ కోహ్లీ (114) తొలి మూడు స్థానాల్లో ఉండగా.. బ్రయాన్ లారా (118)తో కలిసి ధావన్ నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.
|
లారాతో కలిసి అగ్రస్థానంలో
ఇక, ఎడమచేతివాటం బ్యాట్స్మెన్ విషయానికి వస్తే సౌరవ్ గంగూలీ, గ్రేమ్ స్మిత్లను దాటేసి బ్రియాన్ లారాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2010లో ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం చేసిన శిఖర్ ధావన్ ఇప్పటివరకు 15 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు సాధించాడు.