
తీవ్ర నిరాశ:
అమెరికాకు టెన్నిస్ టోర్నమెంట్ కోసం వెళ్లిన సానియా మీర్జా లాక్డౌన్ ముందు హైదరాబాద్ చేరుకోగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడుతూ షోయబ్ మాలిక్ అక్కడే చిక్కుకుపోయాడు. లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయంగా విమానాల నిలిపివేతతో దాదాపు ఐదు నెలలుగా సానియా, షోయాబ్లు దూరంగా ఉన్నారు. దీంతో భారత టెన్నిస్ స్టార్ సానియా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో కూడా తెలిపారు. ఇజాన్ తన తండ్రిని చూడలేకపోతున్నాడు అని భావోద్వేగం చెందారు.

పీసీబీ అనుమతి లభించినా:
ఇక జులైలో ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు ముందు కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం ఇవ్వమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని షోయాబ్ మాలిక్ అభ్యర్థించాడు. కుటుంబంను కలిసేందుకు పీసీబీ నుంచి మాలిక్కు అనుమతి లభించినా.. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి పర్మీషన్ దక్కలేదు. దీంతో ఇక చేసేదిలేక పాక్ నుంచి నేరుగా ఇంగ్లండ్ పర్యటనకి మాలిక్కి వెళ్లిపోయాడు. ఆ టూర్ ముగిసిన అనంతరం మాలిక్ పాక్ వెళ్లకుండా.. యూఏఈలో ఆగాడు. తాజాగా హైదరాబాద్ నుంచి తన కొడుకు ఇజాన్తో కలిసి సానియా మీర్జా అక్కడకు వెళ్లారు.

దుబాయ్లో కొన్ని రోజులు:
ఇజాన్తో దుబాయ్లో తాను ఆడుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షోయబ్ మాలిక్ పోస్ట్ చేశాడు. దుబాయ్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత పాకిస్థాక్కి మాలిక్, సానియా మీర్జా వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన మేర రాణించలేకపోయిన మాలిక్.. ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ కెరీర్లో మాలిక్ ఇప్పటివరకు 35 టెస్టుల్లో, 287 వన్డేల్లో, 116 టీ20 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్లో సంప్రదాయ పద్దతిలో మాలిక్ను సానియా వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు.


Click it and Unblock the Notifications












