ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 18న తొలి మ్యాచ్లో భాగంగా
భారత జట్టు హాంకాంగ్తో తలపడనుంది. ఆ తర్వాతి రోజే చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో దుబాయి వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి.
ఆటగాళ్లపై ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలను
"ఒక మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా.... ఆటగాళ్లపై ఒత్తిడిని తాను అర్థం చేసుకోగలను. భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులు ఎంతో భావోద్వేగంతో మ్యాచ్ను వీక్షిస్తారు. అలాంటి మ్యాచ్లో కోహ్లీ అందుబాటులో లేకపోవడాన్ని ఊహించలేకపోతున్నా. ఏ సిరీస్కు, ఏ టోర్నమెంట్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంపై ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ మరింత కసరత్తు చేయాల్సింది" అని సందీప్ పాటిల్ అన్నారు.
ఆసియా కప్లో పాక్పై విజయం సాధించడం ఎంతో ముఖ్యం
"వెస్టిండీస్తో సిరీస్ కన్నా.. ఆసియా కప్లో విజయం సాధించడమే టీమిండియాకు ముఖ్యం. సారథ్యంలో అంతగా అనుభవంలేని రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు, అతడిపై పెద్ద భారమే ఉంది" అని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వివరించారు. జట్టు కూర్పులో సమతూకం, మంచి టీమ్ను ఎంపిక చేసుకోవడం అతనికి సవాల్గా మారనుందని అన్నారు.
రోహిత్కు తగినంత సమయం లేదు
ప్రస్తుతం రోహిత్కు తగినంత సమయం లేదని నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని సందీప్ పటిల్ సూచించారు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి భారత్-పాక్ మ్యాచ్ జరిగే వరకు ప్రతి క్షణం మ్యాచ్ కోసం సగటు అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్లు (ఫైనల్తో కలిపి) జరిగే అవకాశాలున్నాయి.