అసలేం జరిగింది?
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు అవసరమవగా.. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ నోబాల్ విసిరాడు. కానీ ఫీల్డు అంపైర్ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. దీంతో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ
మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్స్క్రీన్పై చూసిన కోహ్లీ.. ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. ప్రజంటేషన్ సమయంలో అంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అంఫైర్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందంటూ వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం 17 మంది అంపైర్లే ఉన్నారు
దీంతో "ఫీల్డ్, మూడో అంపైర్ బాధ్యతల్లో ప్రస్తుతం 17 మంది అంపైర్లే ఉన్నారు. అందులో 11 మంది భారతీయులు. ఎలైట్ ప్యానెల్లోని విదేశీ అంపైర్లు ఆరుగురు. వీరు కాకుండా మరో ఆరుగురు నాలుగో అంపైర్ బాధ్యతల్లో ఉన్నారు. మ్యాచ్ రిఫరీ మను నాయర్కు రవి, నందన్ చేసిన తప్పులను నివేదించడం మినహా మరే అవకాశం లేదు" అని ఓ అధికారి తెలిపారు.
రవిని తొలగించడం కుదరదన్న బీసీసీఐ
"రవిని తొలగించడం కుదరదు. అతడి స్థానంలో మరొకరిని తీసుకుంటే పరిస్థితి దిగజారుతుంది. అందుకే అతడిపై జరిమానా సైతం విధించేందుకు ఆస్కారం లేదు. 56 మ్యాచ్లకు తక్కువ సంఖ్యలోనే అంపైర్లు అందుబాటులో ఉండటంతో చర్యలు తీసుకునే అవకాశం లేదు. కానీ, మ్యాచ్ రిఫరీ మను నాయర్ అంపైర్ రవికి నెగెటివ్ మార్క్ను వేశారు" అని ఆయన అన్నారు.