క్రికెట్లో అడుగుపెట్టిన కొత్తలో సెహ్వాగ్ చాలా సైలెంట్
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తనదైన శైలిలో ట్వీట్లు అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొత్తలో సెహ్వాగ్ చాలా సైలెంట్గా ఉండేవాడట. ఈ విషయాన్ని క్రికెట్ లెజెంజ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా వెల్లడించాడు.
'వాట్ ఏ డక్' అనే వెబ్ షోలో సచిన్
తాజాగా ఈ ఇద్దరూ కలిసి 'వాట్ ఏ డక్' అనే వెబ్ షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. "టీమిండియాలో చేరిన కొత్తలో సెహ్వాగ్ చాలా సైలెంట్గా ఉండేవాడు. నాతో మాట్లాడేవాడే కాదు. ఇద్దరం కలిసి ఓపెనింగ్కు బరిలోకి దిగాలి. దీంతో మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలని భావించాను' అని సచిన్ తెలిపాడు.
|
ఒకరోజు డిన్నర్కు ఆహ్వానించా
"సెహ్వాగ్ నాతో ఫ్రీగా ఉండేటట్లు చేసుకోవాలి అనుకుని ఒకరోజు డిన్నర్కు ఆహ్వానించా. వెంటనే సెహ్వాగ్ పాజీ నేను పూర్తిగా శాకహారిని, చికెన్ తినను. చికెన్ తింటే లావుగా కనిపిస్తా అని బదులిచ్చాడు. లావుగా కనిపించినప్పుడే చికెన్ తింటానని నేను అన్నాను' అని అప్పటి సంఘటనను సచిన్ చెప్పుకొచ్చాడు.
ఖాళీగా ఉన్న సమయంలో పాడైన వస్తువులను రిపేర్ చేస్తుంటా
అంతేకాదు తాను ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో పాడైన వస్తువులను రిపేర్ చేస్తూ ఉంటానని కూడా సచిన్ తెలిపాడు. "ఇంట్లోనే కాదు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఇలా చేసేవాడ్ని. ఏవైనా వస్తువులను రిపేర్ చేసే సమయంలో నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఫ్యాన్లు, పెయింటింగ్లు, కిటీకీలు ఇలా అన్ని. ఈ పనులన్ని మీకెందుకు అని అంజలి అంటుండేది. కానీ, నాకు ఈ పని ఇష్టంగా ఉంటుంది" అని సచిన్ అన్నాడు.