ధావన్ మాట్లాడుతూ
దీనిపై మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడుతూ "గాయంతో దాదాపు నెలరోజులు జట్టుకు దూరమయ్యా. ఆ సమయంలో ప్రాక్టీస్పైనే దృష్టి సారించాను. తిరిగి బరిలోకి దిగిన నాకు సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి ఒక్కరికి సవాళ్లు ఉంటాయి. ఓపెనర్గా నేను బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తుంటా" అని అన్నాడు.
చెత్త బంతుల్ని బౌండరీలుగా
"లసిత్ మలింగ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్కు ఇన్స్వింగర్ యార్కర్లను ఎక్కువగా సంధిస్తుంటాడు. దీంతో ఈ మ్యాచ్లో నా ప్రణాళికను మార్చుకున్నా. మంచి బంతుల్ని ఎదుర్కొన్నప్పుడు స్ట్రైక్ రొటేట్ చేశాను. చెత్త బంతుల్ని బౌండరీలుగా మలిచాను. మొత్తంగా ఈ సిరీస్లో శ్రీలంకపై మేము పైచేయి సాధించాం" అని ధావన్ అన్నాడు.
ప్రయోగాలకు ఇదే సరైన సమయం
"బ్యాటింగ్ లైనప్లో ప్రయోగాలకు ఇదే సరైన సమయం. ఇందులో భాగంగా ఈ సిరీస్లో బ్యాటింగ్కు రాని వారికి అవకాశాల ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే సంజు శాంసన్, మనీశ్ పాండే మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చారు. వరల్డ్కప్కు ముందు మనకు ఇంకా 15-20 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి" అని ధావన్ చెప్పాడు.
శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా ఆడాడు
"శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా ఆడాడు. పరిమిత ఓవర్లలో మంచి ఆల్రౌండర్గా అతడు జట్టుకు ఎంతో ఉపయోగపడతాడు'' అని గబ్బర్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ధావన్ 36 బంతుల్లోనే 7 ఫోర్లు, సిక్సర్తో అతడు 52 పరుగులు సాధించాడు. పూణె టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్ను 2-0తేడాతో కైవసం చేసుకుంది.