ఆసియా కప్లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో
ఇటీవలే యూఏఈ వేదికగా ముగిసిన ఆసియా కప్లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు పైనల్లో బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ప్రస్తుతం వెస్టిండిస్తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్కు అతడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు.
వెస్టిండిస్తో టెస్టు సిరిస్లో దక్కని చోటు
అయితే, సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపించారు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ అనంతరం పర్యాటక వెస్టిండిస్ జట్టుతో టీమిండియా 5 వన్డేలు, 3 టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ నేఫథ్యంలో రోహిత్ శర్మ తనకు కాస్త ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విజయ్ హాజారే ట్రోఫీలో ఆడేందుకు అంగీకరించాడు.
ధోని కూడా ఆడితే బాగుంటుందన్న గవాస్కర్
ఇదే, విజయ్ హాజారే ట్రోఫీలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఆడితే బాగుంటుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ధోని ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో సొంత రాష్ట్రం తరఫున బరిలో దిగడం లేదు. ఈ మేరకు జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
అక్టోబర్ 21 నుంచి భారత్-విండిస్ జట్ల మధ్య తొలి వన్డే
‘జట్టుతోపాటు ధోనీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మెంటార్ పాత్ర పోషిస్తున్న ధోనీ.. ఇతర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు' అని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో టీమిండియా తన తొలి వన్డేని అక్టోబరు 21 నుంచి ఆడనుంది.