706 పరుగులతో అగ్రస్థానంలో కోహ్లీ
కోహ్లీ (706) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక, ఐపీఎల్ విషయానికి వస్తే ఇప్పటివరకు 159 మ్యాచ్ల్లో 3037 పరుగులు చేసిన రోహిత్ శర్మ 32.61 సగటు, 130.89 స్ట్రైక్ రేటు నమోదు చేశారు. చెన్నైతో జరిగిన మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 535 పరుగులు చేశారు. సగటు 28.15, స్ట్రైక్ రేట్ 124.12 నమోదు చేశారు.
చెన్నైపై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్లు:
1. 706 - విరాట్ కోహ్లీ
2. 535 - రోహిత్ శర్మ
3. 492 - రాబిన్ ఊతప్ప
4. 480 - షేన్ వాట్సన్
5. 448 - శిఖర్ ధావన్
వాంఖడెలో చెన్నైపై రోహిత్ శర్మ రికార్డు ఇలా
తొలి మ్యాచ్ జరుగుతోన్న వాంఖడె స్టేడియంలో చెన్నై సూపర్కింగ్స్తో ఆరు మ్యాచ్ల్లో తలపడిన రోహిత్ శర్మ 54.80 సగటుతో 274 పరుగులు చేశారు. ఈ ఆరు ఇన్నింగ్స్ల్లో రోహిత్ నాలుగు సార్లు 30పరుగులు పైగా నమోదు చేయగా, ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
|
చివరిసారిగా 2015, మే 24న తలపడ్డ చెన్నై-ముంబై
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు గత పదేళ్ల ఐపీఎల్ సీజన్తో పాటు ఛాంపియన్ లీగ్ టీ20ల్లో 24 సార్లు తలపడగా ముంబై 13 మ్యాచ్లు, చెన్నై 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి. చివరిసారిగా ముంబై-చెన్నై జట్ల మధ్య 2015 మే 24న ఐపీఎల ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసకుంది.