ధోని గురించే ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం
"భారత్ క్రికెట్లో ధోని ప్రభావం గురించే మాత్రమే ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం. ఇక నుంచి రిషభ్ పంత్ గురించి మాట్లాడుకుంటాం. ధోని ఎక్కువ కాలం టెస్టు క్రికెట్ ఆడినా ఈ ఫార్మాట్లో కేవలం ఆరు సెంచరీలు మాత్రమే సాధించాడు. అదే సమయంలో ఎన్నో ఘనతలు ధోని సొంతం. కానీ ఈ యువ వికెట్ కీపర్ కచ్చితంగా ధోనిని దాటేస్తాడు" అని పాంటింగ్ అన్నాడు.
బంతిని స్టైక్ చేసే విధానం
"పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యం రిషభ్ పంత్కు ఉంది. అతనిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది. బంతిని స్టైక్ చేసే విధానం చూడ ముచ్చటగా ఉంది. అతను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆడమ్ గిల్క్రిస్ట్ను గుర్తుకు తెస్తున్నాడు. ప్రస్తుతం 21 ఒడిలో ఉన్న రిషబ్ పంత్ సుదీర్ఘ కాలం భారత్ జట్టుకు సేవలందించడం ఖాయం" అని పాంటింగ్ అన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్గా
"రిషబ్ పంత్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నేను కోచ్గా ఉండటం ఎంతో అదృష్టవంతుడిని. వికెట్ కీపింగ్పై పంత్ మరింత దృష్టి సారిస్తే అతడికి తిరుగుండదు" అని పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్లో పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్
138 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో భారత్ వికెట్ కీపర్లు ఎవరూ టెస్ట్ సెంచరీ సాధించలేదు. తొలిసారి పంత్ ఆ ఘనత సాధించాడు. భారత్ తరుపున ఇప్పటివరకు తొమ్మిది టెస్టులాడిన రిషబ్ పంత్కు ఇది రెండో సెంచరీ.
జెఫ్రీ డుజాన్ తర్వాత
గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్లో జరిగిన మ్యాచ్లో పంత్ 114 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు జెఫ్రీ డుజాన్ తర్వాత ఇంగ్లాండ్లోనూ, ఆస్ట్రేలియాలోనూ సెంచరీలు చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు. దీంతో పాటు ఒక టెస్ట్ సిరీస్లో 200 కంటే పరుగులు, 20 క్యాచ్లు అందుకున్న ఉపఖండపు తొలి వికెట్ కీపర్గా రిషబ్ అరుదైన ఘనత సాధించాడు.