
ధోని రికార్డుపై కన్నేసిన పంత్
భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్గా ధోని రికార్డుని కలిగి ఉన్నప్పటికీ ఈ సిరిస్లో అతడు ఆడటం లేదు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. తొలి టీ20 డిసెంబర్ 6న నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

తన ఆటతీరుతో విమర్శలు
ఇటీవలి కాలంలో రిషబ్ పంత్ తన ఆటతీరుతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ లేదా రివ్యూల విషయంలో పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. బంగ్లాదేశ్తో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో అనవసరంగా కెప్టెన్ రోహిత్ శర్మను రివ్యూ తీసుకోమని చెప్పి నవ్వులు పాలయ్యాడు.

కెప్టెన్గా కీరన్ పొలార్డ్
మరోవైపు, వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్గా కీరోన్ పొలార్డ్ నాయకత్వం వహించనున్నాడు. స్వదేశంలో జరిగిన ఓటమికి ఈ సిరిస్లో ప్రతీకారం తీర్చుకోవాలని వెస్టిండిస్ చూస్తోంది. కెప్టెన్గా పొలార్డ్కి ఇది రెండో సిరిస్ కాగా... అంతకముందు ఆప్ఘనిస్థాన్తో జరిగిన టీ20 సిరిస్ మొదటిది కావడం విశేషం.

భారత్-విండిస్ టీ20ల్లో డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్లు వీరే
MS Dhoni - 5 in 7 matches, Catches - 3, Stumpings - 2
Dinesh Ramdin - 5 in 7 matches, Catches - 5, Stumpings - 0
Andre Fletcher- 3 in 4 matches, Catches - 3, Stumpings - 0
Dinesh Karthik - 3 in 4 matches, Catches - 3, Stumpings - 0
Rishabh Pant - 3 in 7 matches, Catches - 3, Stumpings - 0


Click it and Unblock the Notifications












