వెస్టిండిస్ పర్యటనకు దూరమైన ధోని
భారత ఆర్మీకి రెండు నెలలు పాటు సేవలందించేందుకు గాను ధోని తనకు తానుగా వెస్టిండిస్ పర్యటనకు దూరం కావడంతో అతడి స్థానంలో మూడు ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్ వికెట్ కీపర్గా బాధ్యతలు తీసుకున్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (65 నాటౌట్), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
3-0తో సిరిస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా
వెస్టిండీస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. యువ పేసర్ దీపక్ చాహర్ (3/4) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 146/6 కు పరిమితమైంది.
147 పరుగుల లక్ష్య చేధనలో.
అనంతరం 147 పరుగుల లక్ష్య చేధనలో.. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ (3) మళ్లీ నిరాశ పరిచాడు. విండీస్ పేసర్ థామస్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతికి షాట్ ఆడే క్రమంలో కాట్రెల్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (20; 18బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో అలెన్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు.
ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?
కోహ్లీతో కలిసి పంత్ సుడిగాలి ఇన్నింగ్స్
అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఇక క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 16వ ఓవర్లో కోహ్లీ.. 17వ ఓవర్లో పంత్ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అయితే థామస్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.
మరోసారి విరుద్ధ ప్రయోజనాల సెగ.. ద్రవిడ్కు అంబుడ్స్మన్ నోటీసులు
థామస్ బౌలింగ్లోనే పంత్ సిక్స్
కోహ్లీ నిష్క్రమణ అనంతరం థామస్ బౌలింగ్లోనే పంత్ సిక్స్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేసాడు. కాట్రెల్ వేసిన 19వ ఓవర్లో మనీష్ పాండే (2) తడబడంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. ఇక బ్రాత్వైట్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికే పంత్ సిక్సర్ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమయిన పంత్.. ఈ మ్యాచులో ఆకట్టుకున్నాడు.