టెస్టు హోదా పొందిన తర్వాత
గతేడాది టెస్టు హోదా పొందిన తర్వాత టీమిండియాతో ఆడిన తొలి మ్యాచ్లో ఓటమిపాలైన ఆప్ఘనిస్థాన్ ఆ తర్వాత ఐర్లాండ్తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆడిన మూడు టెస్టుల్లోనే ఆప్ఘనిస్థాన్ రెండు టెస్టుల్లో విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనకు గాను రషీద్ ఖాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
రషీద్ ఖాన్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా రషీద్ ఖాన్ మాట్లాడుతూ "లెజెండ్ నబీ జట్టుకు ఎన్నో సేవలు చేశాడు. అప్ఘనిస్థాన్ తరఫున సేవలు అందించినందుకు అతడికి ధన్యవాదాలు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అతడికి అంకితం చేస్తున్నాను. విజయంలో బ్యాట్స్మెన్ కీలకపాత్ర పోషించారు. వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. యువ బౌలర్లు రాణించారు. ఇక పొట్టి ఫార్మాట్పై మా దృష్టిని మళ్లిస్తాం" అని అన్నాడు.
టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి
కాగా, బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్కి ముందే ఆల్రౌండర్ మహ్మద్ నబీ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. తాను ఆడిన రెండు టెస్టుల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్ల్లో కేవలం 33 పరుగులే చేశాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగిన నబీ... రెండో ఇన్నింగ్స్లో 8 పరుగులు చేసిన ఔటయ్యాడు.
టీ20ల్లో కీలక ఆటగాడు
ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మహ్మద్ నబీ కీలక ఆటగాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున నబీ ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా అందించాడు. ఆప్ఘనిస్థాన్ తరుఫున ఇప్పటివరకు 121 వన్డేలు, 67 టీ20లు, మూడు టెస్టులు ఆడాడు. కాగా, నవంబర్ 27వ తేదీన డెహ్రాడూన్ వేదికగా వెస్టిండిస్తో ఆప్ఘనిస్థాన్ మరో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది.