
అయితే, మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికీ ఓ పాము మైదానంలోకి వచ్చింది. అయితే, పాముని చూసిన ఆటగాళ్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో అంఫైర్లు మ్యాచ్ని నిలిపివేశారు. అనంతం స్టేడియం నిర్వాహాక సిబ్బంది ఆ పామును బయటకు తరిమివేయడంతో మ్యాచ్ తిరిగి సజావుగా సాగింది.
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విదర్భ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 29 ఓవర్లకు గాను ఆంధ్ర జట్టు 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. కాగా, గత సీజన్లో గ్రూప్-ఎలో ఆంధ్ర ఆరో స్థానం నిలిచింది. ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా హనుమ విహారి వ్యవహారిస్తున్నాడు.
ఈసారి రంజీ సీజన్లో భారత టెస్టు స్పెషలిస్టు పుజారా, రహానే, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లు బరిలో ఉన్నారు. డోపింగ్లో పట్టుబడి 8 నెలల నిషేధానికి గురైన యువ ఓపెనర్ పృథ్వీషా పునరాగమనం తర్వాత ఆడుతున్న పెద్ద టోర్నీ ఇదే కావడం విశేషం. రికార్డు స్థాయిలో 38 జట్లు ఈసారి టోర్నీ బరిలో ఉన్నాయి.