ప్రతి క్రికెటర్కి అతను ప్రత్యేకం
నేటి మ్యాచ్లో వార్న్ జ్ఞాపకార్థం.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్పై ప్రత్యేక జెర్సీని ధరించాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక ట్విట్టరు హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో.. వార్న్ను రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు స్మరించుకున్నారు. అతనితో తాము గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. వార్న్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి క్రికెటర్కి అతనో ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. వార్న్ తన చుట్టూ ఉన్న వాళ్లలో కాన్ఫిడెంట్ను నింపి తమ మీద తమకు నమ్మకం కలిగిస్తాడని తెలిపాడు. బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మాట్లాడుతూ.. 'అతను ఏం ఆశించాడో ఎల్లప్పుడూ అవి అతనితోనే ఉంటాయని' స్మరణపూర్వకంగా తెలిపాడు.
|
ఇంకా టీంతో పాటే వార్న్ ఉన్నట్లు భావిస్తున్నారు
టీమ్ మేనేజర్ రోమి భిందర్ మాట్లాడుతూ.. రాజస్థాన్ ఆటగాళ్లు ఇప్పటికీ తమతో పాటే వార్న్ ఉన్నట్లు భావిస్తున్నారని.. వార్న్ అందించిన వారసత్వం అలాంటిదని పేర్కొన్నాడు. మొన్నామధ్య జాస్ బట్లర్ గోడకు ఉన్న వార్న్ ఫోటోకు హై ఫై ఇవ్వడం బట్టి వార్న్ ఇంకా మాతో పాటు ఉన్నాడనే ఫీలింగ్లో ప్లేయర్లు ఉన్నారని పేర్కొన్నాడు.
తొలి ఐపీఎల్ వివరాలు
2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ సీజన్లో వార్న్ కెప్టెన్గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్ను పొందాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సోహిల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ని పొందాడు. షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఫైనల్లో యూసుఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.