ఢిల్లీకి బదిలీ:
ఈ నెల 19న ఐపీఎల్ వేలం ముగిసింది. వేలానికి ముందు గత రెండు సీజన్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా ఉన్న అశ్విన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించిన యాజమాన్యం ఢిల్లీ క్యాపిటల్స్కి బదిలీ చేసేసింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అశ్విన్ బరిలోకి దిగబోతున్నాడు. తాజాగా అశ్విన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా #askash అనే హ్యాష్ట్యాగ్తో క్రికెట్ అభిమానులతో మాట్లాడాడు.
మళ్లీ మాన్కడింగ్ చేస్తా:
#askash 'షో'లో భాగంగా ఐపీఎల్ 2020లోనూ మాన్కడింగ్ చేస్తారా? అని అశ్విన్ని ఓ అభిమాని ప్రశ్నించాడు. 'ఓ తప్పకుండా చేస్తా. ఏ బ్యాట్స్మెన్ అయినా క్రీజు వదిలితే మళ్లీ మాన్కడింగ్ చేస్తా' అని బదులిచ్చాడు. ఈ సమాధానంతో అభిమానులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు అశ్విన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'గత ఏడాది విమర్శలు అశ్విన్ మనస్తత్వాన్ని మార్చలేదు' అంటూ విమర్శిస్తున్నారు.
మాన్కడింగ్తో బట్లర్ ఔట్:
ఐపీఎల్ 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ని మాన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ తన జట్టుని గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. అశ్విన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో.. బంతి విసరకముందే బట్లర్ నాన్స్ట్రైక్ ఎండ్లోని క్రీజు వెలుపలికి వెళ్లాడు. ఇది గమనించిన అశ్విన్.. బంతిని విసరకుండా బెయిల్స్ని పడగొట్టాడు. దీంతో బట్లర్ పెవిలియన్ చేరాడు.
కెరీర్కు మచ్చ:
మాన్కడింగ్ చేయడంతో అశ్విన్పై చాలా విమర్శలు వచ్చాయి. క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ చాలా మంది మాజీ క్రికెటర్లు బాహాటంగానే అన్నారు. క్రికెట్ నిబంధనలకి లోబడే మాన్కడింగ్ చేశా అని అశ్విన్ వివరణ ఇచ్చినా ఎవరూ కూడా మద్దతు పలకలేదు. భారత్ తరఫున ఎంతో కీర్తిప్రతిష్టలు గడించిన అశ్విన్.. ఈ ఒక్క ఘటనతో తన సుదీర్ఘ కెరీర్కు మచ్చ తెచ్చుకున్నాడు.