ఉగ్రదాడిని నిరసిస్తూ
మరోవైపు ఉగ్రదాడిని నిరసిస్తూ ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ఆల్ రౌండర్ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాక్ ఫొటోలను ఆ స్టేడియంలో ఉంచారు. ఆ జట్టులో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఆ ఫొటోలను తొలగించారు.
పీసీఏ వినూత్న నిరసన
ఇదిలా ఉంటే, పుల్వామా ఉగ్రదాడిపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పీసీఏ తొలగించింది. స్టేడియంలో లోపలి భాగంలో గ్యాలరీలో, రిసెప్షన్ వద్ద, 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ఈ చిత్రాలు ఉన్నాయి.
ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిదిల ఫోటోలు తొలగింపు
"జవాన్ల పై దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఉన్నాయి. మేం కూడా దానికి అతీతులం కాదు. చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ మా వైపు నుంచి ఈ చర్య తీసుకున్నాం" అని పీసీఏ కోశాధికారి అజయ్ త్యాగి చెప్పారు. తొలగించిన ఫోటోల జాబితాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పాటు మియాందాద్, వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిదిల ఫోటోలు ఉన్నాయి.