రెండు స్థానాలు ఎగబాకిన రోహిత్ శర్మ
తాజాగా వెల్లడించిన ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. ఆసియా కప్లో ఐదు ఇన్నింగ్స్ల్లో రోహిత్ ఒక శతకం, రెండు హాఫ్ సెంచరీలతో రాణించి మొత్తం 317 పరుగులు సాధించాడు. దీంతో 842 పాయింట్లతో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు కోహ్లీ 884 పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు.
ధావన్ కూడా నాలుగు స్థానాలు ఎగబాకి
ఇక ఆసియా కప్లో రెండు సెంచరీలతో మొత్తం 342 పరుగులు సాధించిన మరో ఓపెనర్ ధావన్ కూడా నాలుగు స్థానాలు ఎగబాకి ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసియాకప్లో అద్భుతంగా రాణించి ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించిన బుమ్రా ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. అతని అనంతరం అఫ్గాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ ఉన్నాడు.
కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి
ఆసియా కప్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెనువెంటనే జరగనున్న వెస్టిండీస్తో మ్యాచ్లకు టీమిండియాలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లకు అవకాశమిచ్చింది బీసీసీఐ..
వెస్టిండీస్తో తలపడే భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఉమేశ్, మొహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్