అడిలైడ్ వేదికగా తొలి టెస్టు
గురువారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో పేస్ బౌలింగ్ స్లాట్ కోసం పోటీ పడుతున్న ముగ్గురు టీనేజర్లలో నసీమ్ షా చిన్నవాడు కావడం విశేషం. నసీమ్ షాతో పాటు 19 ఏళ్ల ముహమ్మద్ ముసా, షాహిన్ అఫ్రిదిలు కూడా రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ముహమ్మద్ అబ్బాస్, ఇమ్రాన్ ఖాన్లతో బంతిని పంచుకోనున్నారు.
పాక్ మీడియా విమర్శలు
ఇటీవలే నసీమ్ షా తల్లి చనిపోయారు. అయినా సరే, నసీమ్ షా తన అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దీంతో యువ టీనేజీ బౌలర్లపై ఎక్కువ ఆధారపడటంపై కోచ్ మిస్బా ఉల్ హక్, అతని తోటి సెలెక్టర్లు పాక్ మీడియా తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి జట్టుకు వ్యతిరేకంగా ఆ దేశ పిచ్లపై. అయితే, పాక్ కోచింగ్ స్టాఫ్ మాత్రం దీనిని సమర్ధించుకుంటుంది.
టెస్టు ర్యాంకింగ్స్లో ఏడో స్థానం
ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్లో ఉన్న పాకిస్థాన్ను ప్రపంచ శక్తిగా మార్చడానికి ధైర్యం ముఖ్యమని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగా యువ టాలెంట్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం వకార్ యూనిస్ ప్రస్తావన తెరపైకి తీసుకొచ్చారు. వకార్ యూనిస్ తన 18వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు భారత్పై అరంగేట్రం చేశాడు.
వకార్ యూనిస్ ప్రస్తావన
1989లో కరాచీలో వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన వకార్ యూనిస్ పాక్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు. తన మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన వకార్ యూనిస్ మొత్తం 87 మ్యాచ్ల కెరీర్లో 373 వికెట్లు తీశాడు.
వార్మప్ మ్యాచ్లో మెరిసిన నసీమ్ షా
తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్లో నసీమ్ షా ఎనిమిది ఓవర్లు వేసి ఒక వికెట్తో పాటు 21 పరుగులు ఇచ్చాడు. అడిలైడ్ టెస్టు తుది జట్టులో గనుక నసీమ్ షాకు చోటు దక్కితే 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇదే జాబితాలో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
అతి పిన్న వయస్కుడిగా
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డు హసన్ రాజా పేరిట ఉంది. పాకిస్థాన్కు చెందిన హసన్ రాజా 14 ఏళ్ల వయసులో 1996లో టెస్టు అరంగేట్రం చేశాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా నవంబర్ 21-25న అడిలైడ్ వేదికగా మొదటి టెస్టు జరగనుండగా, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు రెండో టెస్టు జరగనుంది.
టెస్టు జట్టు:
అజార్ అలీ (కెప్టెన్), అబిద్ అలీ, అసద్ షఫీఖ్, బాబర్ అజమ్, హారిస్ సోహైల్, ఇమామ్ ఉల్ హక్, ఇమ్రాన్ ఖాన్ సీనియర్, ఇఫ్తిక ర్ అహ్మద్, ఖషీఫ్ భాటి, మహ్మద్ అబ్బాస్, మహ్మ ద్ రిజ్వాన్, ముస ఖాన్, నసీమ్ షా, షాహీన్ అఫ్రి దీ, షాన్ మసూద్, యాసిర్ షా.