ర్యాంకింగ్స్లో రెండు జట్లు
ర్యాంకింగ్స్లో రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో ఉండడంతో పాక్, భారత్లను ఒకే గ్రూపులో ఉంచడం కుదరలేదు. నాకౌట్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా? అనేది తదుపరి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్-1లో ఉన్నాయి.
అక్టోబర్ 24న జరిగే మ్యాచ్తో
ఇక, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్లో 29న క్వాలిఫయింగ్ జట్టుతో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ'లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న జరిగే మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది.
మొత్తం 12 జట్లు
మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్కు ర్యాంకుల్లో టాప్-8గా ఉన్న జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం శ్రీలంక, బంగ్లాదేశ్ సహా మరో ఎనిమిది జట్లు వరల్డ్ కప్కు ముందు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడి అర్హత సాధించాల్సి ఉంది. నవంబర్ 15న మెల్బోర్న్లో ఫైనల్ నిర్వహిస్తారు.