ఆర్మీ క్యాప్లు ధరించి మరీ భారత్ మ్యాచ్ ఆడింది
"మేము రాజకీయాల్ని, క్రికెట్ను కలపకూడదని అనుకున్నాం. కానీ.. భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఆర్మీ క్యాప్లు ధరించి మరీ మ్యాచ్ ఆడింది. దీనిపై ఐసీసీ నుంచి ఎలాంటి చర్యలూ లేవు. ఐపీఎల్ను పాకిస్థాన్లో ప్రసారం చేయనివ్వకపోతే.. అది కచ్చితంగా భారత క్రికెట్కి నష్టం చేకూరుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ ఓ సూపర్ పవర్" అని చౌదరీ వెల్లడించాడు.
పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మందికి పైగా మృతి
ఫిబ్రవరి 14న కశ్మీన్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు పీఎస్ఎల్ నాలుగో సీజన్ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి టోర్నీ ముగిసే వరకూ అంటే మార్చి 17 వరకూ పీఎస్ఎల్ మ్యాచ్లను భారత్లో డీస్పోర్ట్స్, ఐఎంజీ రిలయన్స్ ప్రసారం చేయలేదు. దీంతో అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించిన పాక్ ఇప్పుడు బదులు తీర్చుకుంది.
2008 ఆరంభ సీజన్లో ఆడిన పాకిస్థాన్ క్రికెటర్లు
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో పాకిస్థాన్ క్రికెటర్లను టోర్నీలో ఆడేందుకు అనుమతిచ్చిన భారత్.. ముంబయి దాడుల తర్వాత వారిని ఐపీఎల్లోకి అనుమతించడం లేదు. దీంతో.. గత పదేళ్లుగా ఐపీఎల్కి దూరంగానే పాక్ క్రికెటర్లు ఉంటున్నారు. మార్చి 23న జరిగే తొలి మ్యాచ్లో కోహ్లి మిస్టర్ కూల్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్... కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.