మాంఛెస్టర్: ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య చిరస్మరణీయమైన మ్యాచ్కు వేదికగా నిలిచిన మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియానికి ఓ చరిత్ర ఉంది. ఈ స్టేడియంలో గెలుపు అవకాశాలు ఛేజింగ్ టీమ్కే ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టేడియానికి ఉన్న హిస్టరీ రిపీట్ కాకూడదని ఆశిస్తున్నారు భారతీయ క్రికెట్ అభిమానులు.
ఈ పదేళ్ల కాలంలో ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం మొత్తం తొమ్మిది మ్యాచ్లకు వేదికైంది. ఇందులో తొలుతగా బ్యాటింగ్ చేసిన జట్టు అన్ని మ్యాచ్లల్లో ఓడిపోయింది. ఈ తొమ్మిది మ్యాచ్లను కూడా ఛేజింగ్ టీమ్ విజయాన్ని అందుకోవడమే కాదు..టాస్ కూడా గెలవడం గమనించదగ్గ విషయం.
ఈ తొమ్మిది మ్యాచ్లల్లో కూడా ఆరింటిని ఛేజింగ్ టీమ్ నేరుగా గెలిచింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మూడు మ్యాచ్లను కూడా ఛేజింగ్ టీమ్ తన సొంతం చేసుకుంది. డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం.. మిగిలిన మూడు మ్యాచ్లను సైతం రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే కైవసం చేసుకుంది.
ఇక్కడ హిస్టరీ రిపీట్ అవుతందా? లేక టీమిండియా దీన్ని బ్రేక్ చేస్తుందా? అనేది తెలియడానికి మరి కొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. బహుశా- ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియానికి ఉన్న ఈ రికార్డును దృష్టిలో ఉంచుకునే- పాకిస్తాన్ జట్టు కేప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్ గెలిచినప్పటికీ.. ఫీల్డింగ్ ఎంచుకుని ఉండొచ్చు.
{headtohead_cricket_3_5}