భారత్ తరఫున అత్యధిక వన్డేల్లో
ఈరోజు మ్యాచ్ ఆడటం ద్వారా భారత్ తరఫున అత్యధిక వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన మూడో క్రికెటర్గా ధోని రికార్డు నెలకొల్పాడు. డిసెంబరు 23, 2004న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన ధోని ఇప్పటివరకు భారత్ తరుపున 334 వన్డేలు ఆడాడు.
అగ్రస్థానంలో సచిన్
నిజానికి తన కెరీర్లో ఇప్పటికే 337 వన్డే మ్యాచ్లు ఆడినప్పటికీ ఇందులో మూడు మ్యాచ్లు ఆసియా ఎలెవన్ తరఫున ఆడినవి కావడం విశేషం. భారత్ తరఫున అత్యధిక వన్డేలాడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 463 వన్డేలతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ 340 మ్యాచ్లతో ఉన్నాడు.
అజహరుద్దీన్ సరసన ధోని
తాజా వన్డేతో ఈ జాబితాలో 334 మ్యాచ్లతో మూడో స్థానంలోకి ఎగబాకిన ధోని... మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సరసన నిలిచాడు. 2014లో టెస్టు క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని అప్పటి నుంచి కేవలం వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది మే నెలలో వరల్డ్కప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.