ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే
ఇద్దరు ఆటగాళ్లు కూడా క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లు. 2012లో రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా... ధోని ఇప్పటికే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్కు త్వరలోనే వీడ్కోలు పలకనున్నాడు. వీరిద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్ అని సగటు క్రికెట్ అభిమానిని అడిగితే సమాధానం చెప్పేందుకు కాసేపు ఆలోచిస్తాడు.
ధోని, పాంటింగ్లలో ఎవరు గొప్ప
తాజాగా, ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో మైక్ హస్సీ ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంలో మైక్ హస్సీ మాట్లాడుతూ "ఇది చెప్పడం చాలా కష్టం. రికీ పాంటింగ్కే నా ఓటు. వన్డేల్లో ధోనీ సారథ్యంలో నేనెప్పుడూ ఆడలేదు. కాబట్టి పాంటింగ్నే ఎంచుకుంటా" అని చెప్పుకొచ్చాడు.
ధోనీ నాయకత్వంలోని
ధోనీ నాయకత్వంలోని టీమిండియా 199 వన్డేల్లో 110 మ్యాచ్లు గెలుపొందింది. ధోని విజయాల శాతం 59.52గా నమోదు కాగా... రికీ పాంటింగ్ విజయశాతం 76.14గా నమోదైంది. ఇదిలా ఉంటే 2011, 2012 సీజన్లలో టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మైక్ హస్సీ ఆడాడు. ప్రస్తుతం ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
79 టెస్టుల్లో 6235 పరుగులు
ఆస్ట్రేలియా తరుపున మైక్ హస్సీ 79 టెస్టుల్లో 6235 పరుగులు చేయగా... 185 వన్డేల్లో 5442, 38 టీ20ల్లో 721 పరుగులు చేశాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మైక్ హస్సీ మొత్తం 21 సెంచరీలు బాదాడు.