
బెంగళూరులో శిక్షణ:
ఆర్మీలో పనిచేయడానికి తనను అనుమతించాలని రాంచీకి చెందిన క్రికెటర్ ఎంఎస్ ధోనీ గత నెలలో ఆర్మీ చీఫ్ను కోరారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం నుండి అతనికి అనుమతి లభించింది. దీంతో విండీస్ పర్యటనకు అందుబాటులో ఉండడనని మహీ.. బీసీసీఐకి తెలిపాడు. ఇక విధులలో చేరేముందు శిక్షణ కోసం బెంగళూరు వెళ్ళాడు.

వీఐపీ మర్యాదలు ఉండవు:
శిక్షణ అనంతరం ధోనీ బుధవారం శ్రీనగర్ చేరుకుని నేరుగా దక్షిణ కాశ్మీర్లోని విక్టర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాడు. అనంతరం విక్టర్ ఫోర్స్తో తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అయితే ధోనీ ఎటువంటి ఆపరేషన్లో భాగం కాదు. ప్రధాన కార్యాలయానికి వచ్చిన తరువాత ధోనీ సహచరులకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ధోనీకి అక్కడ ఎలాంటి వీఐపీ మర్యాదలు ఉండవట. 'ధోనీ ఏడు రోజుల పాటు ఈ యూనిట్తో ఉంటాడు, ఈ సమయంలో అతను తనకు కేటాయించిన విధులను నిర్వర్తిస్తాడు. విధుల సమయంలో ఇతర అధికారిలాగే ఉంటాడు. అతని వద్ద వ్యక్తిగత గన్ ఉంటుంది' అని ఓ అధికారి తెలిపాడు.

యువతకు ఆదర్శం:
దేశ వ్యాప్తంగా పలు బ్రాండ్ల ద్వారా వందల కోట్టు అర్జించే ధోనీ.. సాధారణ సైనికుడిలా దేశం కోసం సేవ చేయడం యువతకు మార్గదర్శకంగా ఉంటుందని భారత ఆర్మీ పేర్కొంది. ధోనీని అభిమానించే యువత ఆర్మీలో చేరే అవకాశం ఉందని ఆర్మీ భావిస్తోంది. విండీస్ పర్యటన నుండి ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. యువ ఆటగాడు రిషబ్ పంత్ను వికెట్ కీపర్గా ఎంపిక చేశారు.


Click it and Unblock the Notifications












